Movies

రంగ్‌దే

Nithin Keerthy Suresh Rang De Begins

యువ కథానాయకుడు నితిన్‌, కథానాయకి కీర్తి సురేశ్‌ జంటగా తెరకెక్కనున్న సినిమా ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా విజయదశమి పర్వదినాన ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమంలో చిత్ర బృందంతోపాటు దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాతలు దిల్‌రాజు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), జెమిని కిరణ్, సుధాకర్ రెడ్డి, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. నితిన్, కీర్తిలపై ముహూర్తపు సన్నివేశానికి త్రివిక్రమ్ క్లాప్ కొట్టారు. దిల్‌రాజు, చినబాబు కలిసి స్క్రిప్టును వెంకీ అట్లూరికి అందించారు. ఈ సందర్భంగా వెంకీ మాట్లాడుతూ… ‘ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. ‘రంగ్ దే’కి ఆయన స్వరాలు ఓ ఆకర్షణ కాబోతున్నాయి. నరేష్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్ తదితరులు నటిస్తున్నారు. విజయదశమి రోజున ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా కంటిన్యూగా జరుగుతుంది. 2020 వేసవి కానుకగా చిత్రం విడుదల కాబోతోంది’ అని అన్నారు.