కేరళలోని కోజికోడ్లో సంచలనం సృష్టించిన 6 వరుస హత్యల ఘటన నిందితురాలు జాలీ గురించి సిట్ షాకింగ్ విషయాలు వెల్లడిండించింది. ప్రస్తుతం ఈ కేసులో సిట్ విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఆమెను ప్రశ్నించగా హత్యల గురించి కొన్ని ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగుచూశాయి. సిట్ చెప్పిన వివరాల ప్రకారం.. నిందితురాలు జాలీకి ఆడపిల్లలంటే పడదని తేలింది. ఆ కోపంతోనే మొదటి భర్త సోదరి కుమార్తె ఆల్ఫైన్ను అంతమొందించిందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులను సైనేడ్ను ఆహారంలో కలిపి చంపిన ఆమె.. మరో ఇద్దరు పిల్లల్ని సైతం అంతమొందించాలని చూసిందని పేర్కొన్నారు. 2002లో అన్నమ్మ థామస్తో హత్యలు మొదలు పెట్టిన జాలీ.. వరుస హత్యల కేసును విచారణ చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కుమార్తెనూ విషం పెట్టి చంపాలని ప్రయత్నించినట్లు సిట్ తెలిపింది. మరోవైపు జాలీ కామర్స్లో డిగ్రీ పూర్తి చేసింది. ఇంజినీరింగ్ పట్టా కూడా అందుకుంది. నిట్లో కొన్ని రోజులు పాఠాలు చెప్పినట్లు జాలీ చెబుతున్నా.. నిట్ యాజమాన్యం మాత్రం ఆ వ్యాఖ్యలను కొట్టిపారేస్తోంది.
మహిళే గానీ మహిళలు అంటే గిట్టరు
Related tags :