‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు నటి కియారా అడ్వాణీ. ఇటీవల బాలీవుడ్లో విడుదలైన ‘కబీర్ సింగ్’ చిత్రంలో ఆమె నటించారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి హిందీ రీమేక్ ఇది. తెలుగులో షాలినీపాండే చేసిన పాత్రను బాలీవుడ్లో కియారా అడ్వాణీ పోషించారు. అయితే మంగళవారం సాయంత్రం ఈ ముద్దుగుమ్మ ట్విటర్ అకౌంట్ హ్యాక్కు గురైనట్లు ఆమె స్వయంగా ఇన్స్టా వేదికగా అభిమానులకు తెలియచేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టా స్టోరీస్లో రెండు పోస్ట్లను పెట్టారు. ‘నా ట్విటర్ అకౌంట్ హ్యాక్కు గురైయ్యింది. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకు నా టీం పనిచేస్తోంది. నా అకౌంట్ నుంచి వస్తున్న ట్వీట్లను ఎవరు పట్టించుకోకండి. అంతేకాకుండా నా ట్విటర్ అకౌంట్ నుంచి వస్తున్న లింక్లను క్లిక్ చేయవద్దు. ప్రస్తుతం నా ట్విటర్లో వచ్చిన లింక్ నేను పెట్టినది కాదు.’ అని కియారా ఇన్స్టా వేదికగా తెలిపారు. సెలబ్రిటీల సోషల్మీడియా ఖాతాలు హ్యాక్ అవడం అనేది కొత్త విషయమేమి కాదు. గతంలో ఒకసారి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నటుడు షాహిద్ కపూర్ ట్విటర్ అకౌంట్లు హ్యాక్కి గురయ్యాయి. అమితాబ్ ట్విటర్ అకౌంట్ను హ్యాక్ చేసి పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఫొటోని డీపీగా పెట్టిన విషయం తెలిసిందే.
హ్యాకింగ్ అనుభవం
Related tags :