నెట్ఫ్లిక్ వెబ్సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ను ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి తెలుగులో రీమేక్ చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో అమలాపాల్ నటించబోతున్నారని కూడా రాసుకొచ్చారు. త్వరలోనే ఇది సెట్పైకి వెళ్లనుందని జోరుగా వదంతులు వచ్చాయి. ఈ వార్తలపై నందిని స్పందించారు. తన ప్రాజెక్టుపై ఈ వదంతులు ఏంటని ప్రశ్నించారు. ‘సబ్ టైటిల్స్ ఉన్న ‘లస్ట్ స్టోరీస్’ను రీమేక్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకమ్మా… ఏంటో ఈ వెరైటీ రూమర్స్’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. నందిని కొత్త సినిమా కొన్ని రోజుల క్రితం ఖరారైంది. ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ కుమార్తెలు స్వప్న, ప్రియాంక దీన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ బాణీలు సమకూరుస్తున్నారు. కాగా, తాను షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్తున్నట్లు అమలాపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో నందినీరెడ్డి సినిమాలో నటించేందుకు వస్తున్నారని ప్రచారం మొదలైంది. నందిని ఇటీవల ‘ఓ బేబీ’తో మంచి హిట్ అందుకున్నారు. సమంత టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’కి తెలుగు రీమేక్గా రూపొందింది.
పుకార్లకు హద్దు ఉండాలి
Related tags :