మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్రను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇసుక కృత్రిమ కొరతకు నిరసనగా మచిలీపట్నం కోనేరు సెంటర్ వద్ద ఆయన తలపెట్టిన 36 గంటల దీక్షను భగ్నం చేశారు.
తొలుత కొల్లు రవీంద్రను గృహ నిర్బంధం చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు.
అప్పటికే వేరే మార్గంలో కోనేరు సెంటర్కు రవీంద్ర చేరుకున్నారు.
అక్కడ బలవంతంగా ఆయనను అరెస్ట్ చేశారు.
అరెస్ట్ సమయంలో పోలీసులకు, తెదేపా తలకు మధ్య తోపులాట జరిగింది.
అంతకుముందు ఆయన నిరసన దీక్షకు వెళ్లకుండా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.