Politics

వెంకయ్యకు కామోరోస్ అత్యున్నత పౌర పురస్కారం

వెంకయ్యకు కామోరోస్ అత్యున్నత పౌర పురస్కారం-Indian Vice President Venkaiah Naidu Receives Comoros Highest Honor

అత్యున్నత పౌరపురస్కారం ద ఆర్డర్‌ ఆఫ్‌ ద గ్రీన్‌ క్రెసెంట్‌ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం అందుకున్నారు.

ఆఫ్రికా దేశం కొమొరోస్‌లో ఉపరాష్ట్రపతి పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

ఆ దేశాధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా వెంకయ్యనాయుడు పురస్కారం అందుకున్నారు.

ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. కామొరోస్‌ అత్యున్నత పౌర పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

130 కోట్ల భారతీయుల తరపున ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నట్లు చెప్పారు.

భారత్‌-కామొరోస్‌ మైత్రికి గుర్తుగా పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ఉగ్రవాదంపై పోరు, భద్రతా మండలిలో సంస్కరణలు, యూఎన్‌వోలో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి మద్దతు వంటి సంయుక్త లక్ష్యమే మనల్ని కలిపిందన్నారు.