ఓ వ్యక్తి హత్యకేసులో నిందితులకు జనగామ కోర్టు జీవితఖైదు విధించింది. గతేడాది కంచనపల్లిలో వరుడిని వధువు, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు. ఇద్దరు ప్రేమికులు కలిసి వరుడిపై పెట్రోల్పోసి నిప్పంటించి హతమార్చారు. రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో గతేడాది ఫిబ్రవరి 18న ఈ దారుణం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పూర్తి వివరాలను ఇవాళ కోర్టుకు సమర్పించడంతో వధువు, ఆమె ప్రియుడికి కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. మాదారం గ్రామానికి చెందిన అరుణకు యాకయ్యతో వివాహం నిశ్చయమైంది. వివాహాన్ని ఫిబ్రవరి 21(గతేడాది)న జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. మరో వ్యక్తి బాలస్వామితో అరుణ లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. యాకయ్యను వివాహం చేసుకోవడం ఇష్టంలేని వధువు అతడి హత్యకు ప్రియుడి సాయంతో కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. వరుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటనలో వరుడితో పాటు అతడి తల్లి కూడా గాయపడింది.
వరుడిని తగలబెట్టిన జనగామ వధువుకు జీవితఖైదు
Related tags :