Movies

జనవరిలో

Ala Vaikunthapuramlo To Be Released In January 2020

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలోనే చిత్ర బృందం వెల్లడించింది. కాగా, ఇప్పుడు తేదీని కూడా ప్రకటించారు. ‘అల.. వైకుంఠపురములో’ సినిమాను జనవరి 12, 2020న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.