NRI-NRT

GWTCS అధ్యక్షురాలిగా పాలడుగు సాయిసుధ

Paladugu Sai Sudha unanimously elected as GWTCS President 2020-21

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) అధ్యక్షురాలిగా పాలడుగు సాయిసుధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020-21 ఏడాదికి గానూ ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ప్రస్తుతం ఆమె ఈ సంస్థ ఉపాధ్యక్షురాలిగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె ఎన్నిక పట్ల సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ తదితర కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు.