హర్రర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘సిండ్రెల్లా’. రాయ్లక్ష్మి ప్రధాన పాత్ర పోషించారు. వినో వెంకటేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ను ఎస్జే సూర్య విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేశ్ మాట్లాడుతూ ‘రొటీన్ ఫార్ములాలో తెరకెక్కే దెయ్యం సినిమాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. ఈ సినిమాతో రాయ్లక్ష్మి ఇమేజ్ పెరుగుతుంది. ఆమె కెరీర్లోనే ఇదో ముఖ్యమైన చిత్రం. నటన పరంగా మంచి మార్కులు పడతాయి. సాక్షి అగర్వాల్ విలన్ పాత్రలో కనిపిస్తుంది. రోబోశంకర్, వినోద్, గజరాజ్లు ముఖ్యపాత్రలు పోషించారు. ‘కాంచన 2’కు సంగీతం అందించిన అశ్వమిత్ర ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ‘సిండ్రెల్లా’ అనే పేరు అందరికి సుపరిచితం. సినిమా కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. టీజర్కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ట్రైలర్కు ఆధరణ వస్తోంది. త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నామని’ పేర్కొన్నారు.
హారరే కాని కొంచెం కొత్తగా
Related tags :