Politics

రేపు ఢిల్లీకి జగన్

YS Jagan To Tour Delhi Tomorrow

ఏపీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు దిల్లీ వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యే అవకాశముంది. రేపు ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో జగన్‌ పాల్గొంటారు. అనంతరం 10 గంటలకు ఆయన దిల్లీ పర్యటనకు వెళ్తారు.