Politics

చిదంబరానికి కడుపునొప్పి. ఏమి ఫర్వాలేదన్న వైద్యులు.

Chidamabram Sent To AIIM For Stomach Ache

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. తీవ్రమైన కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు రావడంతో ఆయనను ఎయిమ్స్‌లో చేర్పించారు. సోమవారం ఉదయం తొలుత ఇక్కడి ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తరలించిన అనంతరం.. సాయంత్రం ఎయిమ్స్‌కు తరలించారని సమాచారం. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై భిన్న ప్రకటనలు వినిపిస్తున్నాయయి. ఆయన ఆరోగ్యం అంతగా ఏమీ బాగాలేదని ఆయన అనుచరులు చెబుతుండగా.. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి.