Politics

ఆలస్యంగా వచ్చినందుకు ₹50లక్షలు జరిమానా

TRS Harish Rao Imposes Self Fine For Being Late To Meeting

ఓ కార్యక్రమానికి ఆలస్యంగా హాజరైనందుకుగానూ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్వీయ జరిమానా విధించుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక పరిధిలోని మహిళా సంఘాల ప్రతినిధులకు చెత్తబుట్టలను అందజేసే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు ఆలస్యంగా రావడంతో తనకు తానుగా రూ.50లక్షల జరిమానా విధించుకున్నారు. ఆ మొత్తంతో ఆధునిక హంగులతో మహిళా భవనాన్ని నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. స్వచ్ఛ దుబ్బాకగా మార్చేందుకు మహిళా ప్రతినిధులు ముందుకు రావాలని కోరారు. తడిపొడి చెత్తను వేసేందుకు రూ.3 కోట్లతో డంపింగ్‌ యార్డు మంజూరు చేశామని ఈ సందర్భంగా హరీశ్‌రావు వెల్లడించారు. సిద్ధిపేట తరహాలోనే దుబ్బాకను కూడా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.