Sports

చైనా ఓపెన్‌లో భారత జట్టు ఓటమి

Indian Mens Double Team Loses Chinese Open

చైనా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌ శెట్టి స్ఫూర్తిదాయ ప్రదర్శన ముగిసింది. మూడుసార్లు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ మార్కస్‌ ఫెర్నాల్ది, కెవిన్‌ సంజయ సుకముల్జో (ఇండోనేషియా)పై పోరాడి ఓడింది. హోరీహోరీగా సాగిన సెమీఫైనల్లో భారత ద్వయం 16-21, 20-22 తేడాతో వరుస గేముల్లో తలవంచింది. ఈ ఇండొనేషియా జోడీ చేతిలో భారత జంట ఓడిపోవడం ఇది వరుసగా ఎనిమిదోసారి. సాత్విక్‌, చిరాగ్‌ జోడీ ఈ ఏడాది అద్భుతంగా ఆడుతోంది. ఆగస్టులో థాయ్‌ల్యాండ్‌ ఓపెనర్‌ సూపర్‌ 500 టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. ఆ తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. అనూహ్యంగా సెమీస్‌ చేరిన ఈ జోడీకి చైనా ఓపెన్‌లో ఓటమి తప్పలేదు. మ్యాచ్‌లో రెండో జోడీలు సుదీర్ఘ ర్యాలీలు ఆడాయి.