Devotional

అయోధ్య స్థలం హిందువులదేనని తీర్పు వెలువరించిన సుప్రీం

Indian Supreme Court Delivers Verdict On Ayodhya Case

అయోధ్య వివాదంపై సుప్రీం ఏకగ్రీవ తీర్పు

అయోధ్య వివాదాస్పద స్థలం హిందూవులదేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. 

2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు.

మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు.

స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశం.

ఏకగ్రీవ తీర్పు వెలువరించిన ఐదుగురు  న్యాయమూర్తులు.

వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదే: సుప్రీం కోర్టు

అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవ తీర్పును వెలువరించారు. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదే అని స్పష్టం చేసింది. 

అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం.

వివాదస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్​ ఏర్పాటు చేయాలి: సుప్రీం

వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్ర ప్రభుత్వం  ట్రస్ట్ ఏర్పాటు చేయాలి.

వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్ అధీనంలో ఉంచాలి.

ఆలయ నిర్మాణం, ట్రస్ట్ విధివిధానాలపై 3 నెలల్లోగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి

మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి: సుప్రీం

డిసెంబర్‌ 16, 1949 వరకు ముస్లింలు నమాజ్‌ చేసేవారు.

అలహాబాద్‌ హైకోర్టు ఉమ్మడి అధీనం కోసమే ఆదేశాలిచ్చింది.

మతపరమైన వివక్షకు రాజ్యాంగంలో స్థానం లేదు.

మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి.

1956కు ముందు ఆ స్థలం తమ అధీనంలో ఉందని నిరూపించేందుకు ముస్లింలు ఆధారాలు చూపలేకపోయారు