సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ ఏ కార్యక్రమం చేపట్టినా వినూత్నంగా ఉంటుంది. అమెరికాలో పుట్టి పెరిగిన ఆనంద్ ఇరువురి సంతానం వివాహం ఆనంద్ స్వస్థలమైన కృష్ణాజిల్లా మచిలీపట్నంలోనే నిర్వహించారు. గతంలో ఆయన కుమార్తె అనూష వివాహం నిర్వహించిన ఆయన స్వగృహంలోనే ఆయన కుమారుడు అరుణ్రాజ్ వివాహం శనివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. పలువురు కవులు, కళాకారులు, సిలికానాంధ్ర సభ్యులు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ వివాహ వేడుకకు హజరై నూతన దంపతులు అరుణ్,లీలలను ఆశీర్వదించారు. పచ్చని అరటి, కొబ్బరి ఆకులతో స్టేజీని హరితవనంగా అలంకరించారు. మొత్తం పచ్చదనం ఉట్టిపడే విధంగా ఆయన గృహాన్ని, మండపాన్ని, పరిసరాలను అలంకరించారు. ఈ వివాహానికి హాజరయిన వారిలో ఏపీ అసెంబ్లీ మాజీ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఏపీ నాటక అకాడమీ మాజీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ, తెదేపా నేతలు బచ్చుల అర్జునుడు, పీ.ఆర్.మోహన్, కళాకారులు వీణాపాణి, పండితులు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, అన్నవరపు రామస్వామి, సిలికానాంధ్ర సభ్యులు కొండుభట్ల దీనబాబు, చమర్తి రాజు, చింతలపూడి జ్యోతి, అనీల్ అన్నం, న్యూకాన్ బ్రిక్స్ అధినేత తోటకూర శ్రీనివాసరావు, TNI డైరక్టర్ కిలారు ముద్దుకృష్ణ తదితరులు పాల్గొని అరుణ్-లీలలను దీవించారు. కూచిభొట్ల ఆనంద్, శాంతి దంపతులకు అభినందనలు తెలిపారు. సాంప్రదాయబద్ధమైన తెలుగు వంటకాలతో పసందైన విందు భోజనాన్ని వడ్డించారు.
బందరులో వైభవంగా కూచిభొట్ల వారి పెళ్లిసందడి
Related tags :