Politics

శివసేనకు గవర్నర్ పిలుపు

Governor Calls For Shivsena To Take Charge And Form The Govt

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా సుముఖత వ్యక్తంచేయని వేళ, రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన శివసేనను గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖతను, బలాన్ని తెలియజేయాలని ఆ పార్టీ సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ షిండేకు సమాచారమిచ్చారు. సోమవారం రాత్రి 7.30 గంటల్లోగా నిర్ణయం తెలపాలని గవర్నర్‌ సూచించారు.