అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముంబయిలోని ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 1న దాదా నేతృత్వంలో సాధారణ వార్షిక సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ పాలక వర్గంలో నాలుగింట మూడో వంతు మద్దతు అవసరం కాగా, సుప్రీంకోర్టు ఆమోదం కూడా తప్పనిసరి. ఒకవేళ కోర్టు అనుమతిస్తే దాదా ఆరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం గంగూలీ తొమ్మిది నెలలపాటే బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాల్సి ఉంది. రెండోసారి ఆ పదవిలో కొనసాగాలంటే మూడేళ్ల విరామం ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ పాలక వర్గం ఆ నిబంధనను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
బీసీసీఐ అధ్యక్షుడిగా ఆరేళ్ల వరకు గంగూలీనే?
Related tags :