NRI-NRT

ఆస్ట్రియాలో గ్రీన్‌ఛాలెంజ్

TNILIVE Austria Telugu News-NRTs Plant Trees As Part Of Green Challenge

హరిత తెలంగాణ కోసం తన వంతు మద్దతుగా టీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఛాలెంజ్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. గతేడాది సంతోష్ నాటిన ఒక్క మొక్కతో మొదలైన గ్రీన్ ఛాలెంజ్ నేడు ప్రపంచ దేశాలకు విస్తరించింది. . టీఆర్‌ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపు మేరకు డెన్మార్క్ తెరాస శాఖ అధ్యక్షులు ఆకుల శ్యామ్ బాబు ఛాలెంజ్ ని స్వీకరించి . టీఆర్‌ఎస్ ఎన్నారై ఆస్ట్రియా ప్రెసిడెంట్ మేడిపల్లి వివేక్ రెడ్డి ఆదివారం రోజున ఆస్ట్రియా లో మొక్కలు నాటారు . ఈసందర్బంగా వివేక్ మాట్లాడుతూ అధిక సంఖ్యలో చెట్లను నాటడం వల్ల వాతావరణంలో గాలి నాణ్యత మెరుగువుతుందని అధిక వర్షాలు కురిసి ఆకుపచ్చని తెలంగాణ కావాలని కోరారు .ఈ కార్యక్రమం లో వైస్ ప్రెసిడెంట్ కంది వంశీ ,శ్రీపాల్ రెడ్డి ,భరత్ తదితరులు పాల్గొన్నారు .