Politics

ప్రైవేటీకరణపై కేసీఆర్ సమీక్ష

KCR Reviews TSRTC Privatization-Telugu Political News Today Nov 2019

రూట్ల ప్రైవేటీకరణ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమీక్షకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా, అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, అదనపు అడ్వొ కేట్‌ జనరల్‌ రామచందర్‌రావు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 5100 రూట్లలో ప్రైవేటు పర్మిట్లపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రూట్‌ పర్మిట్లపై ఇచ్చిన స్టేను సోమవారం వరకు పొడిగించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రస్తావించిన అంశాలను అడ్వకేట్‌ జనరల్‌ .. సీఎంకు వివరించినట్టు సమాచారం.