ఎస్-400 క్షిపణులను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే భారత్కు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.
రష్యా నుంచి రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదంటూ ఇంతకుముందు భారత్ను అమెరికా హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఎస్-400 కొనుగోలుకే నిర్ణయించుకున్నట్లు సమాధానమిచ్చిన భారత్.. రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.
మరికొంతకాలంలో భారత అమ్ములపొదిల ఈ అత్యాధునిక క్షిపణులు చేరనున్నాయి.