Movies

ఈ వివక్ష ఇంకెన్నాళ్లు?

Sameera Reddy Speaks On Bias Against Females

‘జై చిరంజీవ’, ‘నరసింహుడు’, ‘అశోక్‌’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సమీరారెడ్డి. వివాహం చేసుకున్న తర్వాత ఆమె వెండితెరకు దూరం అయ్యారు. అయితే, సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో దగ్గరగానే ఉంటున్నారు. తన ఫొటోలతో పాటు, తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను సైతం అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా, తన కుమార్తె ఫొటోలను షేర్‌ చేస్తూ కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పసిపాపతో ఉండటంతో చాలా సరదాగా ఉంటుంది. కానీ, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మన దేశంలో చాలా మంది ఆడపిల్లను భారంగానే పరిగణిస్తారు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే ప్రస్తుతం అలాంటి ఆలోచనా ధోరణి మారిందని అనుకుంటున్నా. అయితే, ఇప్పటికీ కొన్ని పట్టణ ప్రాంతాల్లో తొలి కాన్పులో మగబిడ్డ కావాలని వారి కుటుంబాలు ఆశిస్తాయి. ముగ్గురు ఆడపిల్లలు ఉన్న కుటుంబంలో ఒకదానినైన నేను మాత్రం ఒక్క విషయం కచ్చితంగా చెప్పగలను. మేము అబ్బాయిలకంటే ఎక్కువే సాధించాం’’ అని సమీరారెడ్డి చెప్పుకొచ్చారు.