Politics

సీఎంలా మాట్లాడితేనే గౌరవమిస్తాను

Pawan Kalyan On YS Jagan-Give Respect And Take Respect

రాష్ట్రంలోని రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రత్యేకహోదా గురించి మోదీ దగ్గర అడిగే ధైర్యం వైకాపాకు లేదని ఆయన ఎద్దేవా చేశారు. కడప జిల్లా రైల్వేకోడూరులో రైతులతో సమావేశమైన అనంతరం ఏర్పాటుచేసిన సభలో పవన్‌ మాట్లాడారు. భారతి సిమెంట్‌ పరిశ్రమపై ఉన్న శ్రద్ధ కడప ఉక్కు పరిశ్రమపై ఎందుకు లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి సీఎంలా మాట్లాడితే ముఖ్యమంత్రి అని సంభోదిస్తానని.. కొంతమందికే సీఎంలా ప్రవర్తిస్తే పేరు పెట్టే పిలుస్తానన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్‌ సీమ కాదని.. చదువుల తల్లి సీమని అని ఆయన కొనియాడారు. సమస్యలతో పోరాడటానికి చదువులు ఉపయోగపడాలని.. ఆశయం కోసం పనిచేసే వారికి గెలుపోటములతో సంబంధం లేదని చెప్పారు.