Politics

ఇంధన ధరలు తగ్గించే ఆలోచనే లేదు

Our Govt Has No Plans Of Reducing Fuel Prices-Nirmala Sitharaman

పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు తగ్గించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆమె నేడు లోక్‌సభలో మాట్లాడుతూ ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇంధన ధరలు స్థిరంగా లేవని వెల్లడించారు. ఒక రకంగా చూస్తే ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ జీఎస్‌టీ జీరో రేటు కేటగిరిలో ఉన్నట్లే లెక్క అని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని, రేట్లను జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయిస్తుందని వెల్లడించారు. ‘‘ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు తగ్గించే ప్రతిపాదన లేదు.వీటిపై కొత్త పన్నులు విధించే ప్రతిపాదనలు కూడా పరిశీలనలో లేవు’’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రాలు వీటిపై విధించే వివిధ పన్నులకు తోడు భారీగా పన్నులను విధిస్తోంది. రైతులకు రాయితీపై డీజిల్‌ విక్రయించే విషయంపై అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను రేట్లు వేర్వురుగా ఉన్నాయని ఆమె సమాధానమించారు.