సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం దర్భార్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. అయితే దర్భార్ సినిమా రిలీజ్ కాకముందే రజనీకాంత్ 168,169 చిత్రాలకి సంబంధించి కొద్ది రోజులుగా పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.విశ్వాసం ఫేమ్ శివ దర్శకత్వంలో రజనీకాంత్ 168వ చిత్రం రూపొందనుండగా, ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నారు. డిసెంబర్ మూడో వారంలో చిత్రం లాంచ్ కానుందని తెలుస్తుంది. కీర్తి సురేష్, జ్యోతిక, మీనా, ఖుష్బూ, మంజు వారియర్లలో ఒకరు చిత్రంలో కథానాయికగా నటిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్కి జోడీగా మీనా ఎంపికైందని చెబుతున్నారు. మీనా ..రజనీకాంత్తో కలిసి యజమన్, వీరా, ముత్తు అనే చిత్రాలు చేసింది. 90లలో వీరిద్దరిని హిట్ పెయిర్గా చెప్పేవాళ్ళు. మరి మీనా, రజనీకాంత్ మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారని వస్తున్న వార్తలలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.
మరోసారి ముత్తు కాంబో
Related tags :