Business

₹44.98లక్షలతో నూతన మోడెల్

Jaguar Land Rover Released New 2020 Jaguar XE In India-₹44.98లక్షలతో నూతన మోడెల్

దేశీయ మార్కెట్లోకి జాగ్వర్‌ ల్యాండరోవర్‌ సరికొత్త కారును విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న జాగ్వార్‌ ఎక్స్‌ఈ 2020 వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.44.98లక్షలు. పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లతో ఇవి లభించనున్నాయి. భారత్‌ స్టేజ్‌ 6 నిబంధనలను ఇవి అందుకొన్నాయి. ఎస్‌, ఎస్‌ఈ వేరియంట్లలో అందుబాటలోకి తీసుకువచ్చారు. ఈ కారును తొలిసారి 2016లో భారత్‌లో విడుదల చేశారు. ఈ కారు బయటి భాగాల్లో ముందు, వెనుక బంపర్లను అప్‌డేట్‌ చేశారు. హైలైన్‌ టెయిల్‌ లైట్స్‌, యానిమేటెడ్‌ డైరెక్షనల్‌ ఇండికేటర్స్‌ను అందిస్తున్నారు. దీనిలో బూట్‌ పీ250(పెట్రోల్‌), డీ180(డీజిల్‌) ఇంజిన్లను అమర్చారు. ఎస్‌ వేరియంట్‌ కారుకు 17 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, టాప్‌ ఎండ్‌ ఎస్‌ఈ వేరియంట్‌కు గ్రే ట్విన్‌ 5స్పోక్‌ అలాయ్‌ వీల్స్‌ అందజేశారు. పెట్రోల్‌ వెర్షన్‌కు రెండు ఎగ్జాస్ట్‌ పైప్‌ల చెరోవైపు అందించగా.. డీజిల్‌ వెర్షన్‌లో మాత్రం రెండు ఎగ్జాస్ట్‌ పైపులను ఎడమవైపే ఇచ్చారు. క్యాబిన్లో జాగ్వార్‌ చాలా మార్పులు చేసింది. డ్యాష్‌బోర్డ్‌, స్టీరింగ్‌ వీల్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ పూర్తిగా సరికొత్తవి అమర్చారు. కారు ముందు వరుసలో స్పోర్ట్స్‌ బకెట్‌ సీట్లను ఇచ్చారు. వీటిని పలు విధాలుగా మార్చుకోవచ్చు.