Politics

దిశా ఎన్‌కౌంటర్‌ను కసబ్ కేసుతో పోల్చిన ఒవైసీ

Asaduddin Owaisi Finds Fault With Encounter Of Priyanka Rapists

దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌లో చంపేసిన ఘటనపై కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ఈ ఎన్‌కౌంటర్‌ను తప్పుబడుతున్నారు. తాజాగా ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ ఈ సంఘటనపై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నేను వ్యక్తిగత ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌పై మెజిస్ట్రియల్ విచారణ జరగనుంది. ఇదంతా పోలీసుల పర్యవేక్షణలో ఉండగానే జరిగింది. ఎంపీలంతా ​కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. అజ్మల్ కసబ్ లాంటి వ్యక్తుల కేసులు వాయిదాపడుతూ ఉన్నాయి. ఈ కేసులో ఎందుకు అలా జరగలేదని ఆయన ప్రశ్నించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఎన్‌కౌంటర్‌పై వివరణ కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ఒవైసీ గుర్తుచేశారు.