Politics

జగన్…వివేకా కేసు సీబీఐకు ఇవ్వండి

Kanna Lakshminarayana YS Jagan To Transfer Viveka Murder Case To CBI

వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. వైఎస్ వివేకా హత్య కేసు నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. మార్చిలో హత్య జరిగితే ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోయారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాకపోతే ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు.