ఈ ఏడాది విశ్వసుందరిగా దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టుంజీ నిలిచారు. అమెరికాలోని జార్జియా రాజధాని అట్లాంటాలో ఆదివారం రాత్రి జరిగిన తుది పోటీల్లో టుంజీని విజేతగా ప్రకటించారు. గతేడాది విశ్వసుందరి కాట్రియోనా గ్రే.. జోజిబిని టుంజీకు కిరీటం అలంకరించారు. మొత్తం 90 మంది ఈ పోటీలో పాల్గొననగా.. కిరీటం టుంజీని వరించింది. మిస్ యూనివర్స్ మెక్సికో సోఫియా ఆరాగన్, మిస్ యూనివర్స్ ప్యూర్టోరికా మాడిసన్ అండెర్సన్ రన్నరప్లుగా నిలిచారు. విజేతగా ప్రకటించడానికి ముందు టుంజీ మాట్లాడుతూ.. ‘నా రంగు, నా జుట్టును చూసి ఎవరూ అందంగా ఉందని అనరు. అలాంటి ప్రపంచంలో నేను పెరిగాను. ఇక అలాంటి వివక్షకు ముగింపు పలికే సమయం ఇదే అని నేను భావిస్తున్నా’ అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.
26ఏళ్ల టుంజీ స్వస్థలం దక్షిణాఫ్రికాలోని సోలో. లింగ ఆధారిత వివక్ష, హింసకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తున్నారు. ఈ పోటీలో భారత్కు చెందిన వర్తికా సింగ్ టాప్ 20లో కూడా చోటు దక్కించుకోలేకపోయారు.
విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా చిన్నది
Related tags :