NRI-NRT

నాట్స్ నా కన్నబిడ్డ వంటిది-బోర్డు నూతన ఛైర్మన్ అప్పసాని శ్రీధర్

నాట్స్ నా కన్నబిడ్డ వంటిది-బోర్డు నూతన ఛైర్మన్ అప్పసాని శ్రీధర్-NATS 2021 Convention In New Jersey-Appasani Sreedhar Will Be NATS BOD Chairman For 2020-21

2020-21కు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) నూతన బోర్డు నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. నూతన ఛైర్మన్‌గా అప్పసాని శ్రీధర్ ఎన్నికయ్యారు. ఫిలడెల్ఫియాలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. నాట్స్ సంస్థలో దశాబ్ద కాలంగా సేవలందిస్తున్న బోర్డు ప్రస్తుత వైస్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని ఎన్నిక పట్ల ప్రస్తుత బోర్డు ఛైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాసబాబులు హర్షం వెలిబుచ్చారు. బోర్డు ఉపాధ్యక్షురాలిగా అరుణా గంటి, కార్యదర్శిగా ప్రశాంత్ పిన్నమనేనిలు ఎన్నికయ్యారు. వీరితో పాటు బోర్డు సభ్యులుగా నూతనంగా హ్యూస్టన్ నుండి సునీల్ పాలేరు, డాలస్‌ నుండి కిషోర్ వీరగంధం, లాస్ ఏంజిల్స్‌ నుండి చందు నంగినేని, కృష్ణ కిషోర్ మల్లిన, చికాగో నుండి శ్రీరామమూర్తి కొప్పాక, రవి శ్రీకాకుళం, ఓహియో నుండి సురేశ్ పూదోట, పెన్సిల్వేనియా నుండి హరినాథ్ బుంగతావులకు చోటు లభించింది. నాట్స్ బోర్డు సమావేశంలో నాట్స్ హెల్ప్‌లైన్ కార్యక్రమాలను మరింత విసృత్తం చేయాలని నిర్ణయించారు. 2021లో న్యూజెర్సీలోని న్యూజెర్సీ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోసిషన్ సెంటరులో నిర్వహించనున్న అమెరికా తెలుగు సంబరాలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని శ్రీధర్ తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. నాట్స్ తనకు సొంతబిడ్డతో సమానమని, బోర్డు ఛైర్మన్ వంటి కీలక పదవికి తాను ఎన్నిక కావడం ఆనందంగా ఉందని అన్నారు. గుత్తికోండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఛైర్మన్‌గా నాకు వచ్చిన అవకాశాన్ని ఓ అదృష్టంగా భావించి నా శాయశక్తులా దానిని సమర్థంగా నిర్వర్తించేందుకు కృషి చేశానని, ప్రతి అడుగులో నాట్స్ సభ్యుల పూర్తి సహాయ సహాకారాలు లభించాయని, వారికి తన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌతు లచ్చన్న ఫౌండేషన్ (గ్లో) సంస్థ వైస్ ఛైర్మన్ వెంకన్న చౌదరి, సేవా సంస్థ నిర్వాహకురాలు సరోజ సాగరం, నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు మధు కొర్రపాటి, మోహనకృష్ణ మన్నవ, శ్యాం నాళం, లక్ష్మి మోపర్తి, నరేంద్ర, శిల్పారావ్, యాంకర్ సాహిత్య, ఇమిటేషన్ రాజు, నాట్స్ ఫిలడెల్ఫియా ప్రతినిధి రామ్ కొమ్మనబోయిన తదితరులు పాల్గొన్నారు.