భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధుకు కాస్త ఊరట! బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్లో ఆమెకో విజయం దక్కింది. గ్రూప్-ఏలో నామమాత్రమైన పోరులో చైనా అమ్మాయి హీ బింగ్జియావోపై 21-19, 21-19తో విజయం సాధించింది. గ్రూప్లో మూడో స్థానంలో నిలిచింది. అంతకు ముందు ఆమె వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి సెమీస్ అవకాశం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. బింగ్జియావోతో పోరులో 9-18తో వెనకబడ్డ సింధు వరుసగా 9 పాయింట్లు సాధించి తొలి గేమ్ కైవసం చేసుకోవడం గమనార్హం. ప్రత్యర్థి దూకుడుగా ఆడుతూ 7-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరింత విజృంభించి 11-6తో ముందుకెళ్లింది. సింధు షటిల్ను దూరంగా ఆడుతూ అనవసర తప్పులు చేసింది. ఈ క్రమంలో బింగ్జియావో 19-9తో గేమ్ పాయింట్ వైపు పయనిస్తుండగా సింధు అద్భుతంగా ప్రతిఘటించింది. వేగంగా ఆడుతూ 18-18తో స్కోరు సమం చేసింది. 19-19 వద్ద తెలివిగా ఆడి రెండు పాయింట్లు చేసి తొలి గేమ్ గెలిచింది. అదే ఊపులో రెండో గేమ్ను 7-3తో ఆరంభించింది. 11-6తో ముందుకెళ్లింది. ఈ క్రమంలో పుంజుకున్న బింగ్ 10-15, 16-18తో సింధును చేరుకుంది. అయితే బ్యాక్లైన్ వద్ద సింధు కాస్త తెలివిగా ఉండటంతో మూడు పాయింట్లు లభించాయి.
సీంధు గెలిచింది. కానీ ప్రయోజనం లేదండీ!
Related tags :