అసెంబ్లీ ఆవరణలో మార్షల్స్పై టీడీపీ సభ్యులు దౌర్జన్యానికి దిగడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా ప్రవర్తించారన్నదానికి ఈ ఘటన నిదర్శమని తెలిపారు.
ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నించారు.
టీడీపీ సభ్యుల దౌర్జన్యానికి సంబంధించిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాను సభలోకి ప్రవేశించాల్సిన గేటు అసలు అది కాదు.
ఆయన గేటు నెంబర్ 2 నుంచి సభలోకి రావాల్సి ఉంది. కానీ అందరితో కలిసి ఆందోళన చేయాలని చంద్రబాబు చూశారు.
ప్రోటోకాల్ ప్రకారం సభ్యులను మాత్రమే లోనికి పంపేందుకు మార్షల్స్ ప్రయత్నించడం.
కానీ చంద్రబాబు నాయుడు మార్షల్స్ను బాస్టడ్ అని దూషించడం దారుణం.
లోకేశ్ చీఫ్ మార్షల్స్ను యూజ్లెస్ అంటూ తిట్టారు. ఉద్యోగుస్తులను అనరాని మాటలు అన్నార’ని తెలిపారు.