అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కవి సమ్మేళనం, కొత్తతరం కవుల కవిగానం, కథకులు ఆలోచన, అనుభవాలు, పద్యం పాటా, జానపదం కార్యక్రమాలను ఈ వేడుకలో భాగంగా నిర్విహించారు. కవులు కె.శివారెడ్డి, నందిని సిధారెడ్డి, రాచపాళెం, కె.శ్రీనివాస్, ఓల్గా, అఫ్సర్, కసిరెడ్డి వెంకట రెడ్డిలతో ఇప్పటి కథకుల ఆలోచనలు, అనుభవాలు కార్యక్రమంలో కె.ఎన్.మల్లీశ్వరి, వెల్దండి శ్రీధర్, పూడూరి రాజిరెడ్డి, వెంకట సిద్ధారెడ్డి, మల్లికార్జున్, పూర్ణిమ తమ్మిరెడ్డి, స్వాతి కుమారి బండ్లమూడి పాల్గొన్నారు. పన్నేండు మంది కొత్త తరం కవులతో కవి సమ్మేళనం జరిగాయి. నేపద్య గేయ రచయితలు దేశపతి శ్రీనివాస్, అనంత శ్రీరామ్, ప్రొద్దుటూరి యెల్లారెడ్డి ఆధ్వర్యంలో ‘పద్యం, పాట, జానపదం’ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆటా ప్రసిడెంట్ పరమేశ్ భీం రెడ్డి, తదపరు ప్రసిడెంట్ భువనేశ్ బుజాలా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బోదిరెడ్డి, రామకృష్ణ రెడ్డి అలా, ఆటా 2020 కన్వేంషన్ కన్వీనర్ నర్సింహా రెడ్డి ద్యాసాని పలువురు ఆటా ప్రతినిధులతో పాటు 20 మంది అమెరికా నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలకు “ఆటా” వారధిగా ఉంటుందని అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.
నాంపల్లిలో వైభవంగా “ఆటా” సాహితీ సదస్సు
Related tags :