ScienceAndTech

అసలు రాజధాని నిర్మాణానికి ప్రాతిపదిక ఏంటి?

How and what are the basics of building a capital?

*వివిధ దేశాల్లో కొత్త రాజధానుల నిర్మాణానికి మూలసూత్రం ఇదే..
ప్రపంచంలోని వివిధ దేశాలు కొత్త రాజధానుల్ని ఏర్పాటుచేసుకున్నాయి. కొన్ని దేశాలు అప్పటికే ఉన్న రాజధానులకు సమీపంలోనే కొత్త వాటిని అభివృద్ధి చేసుకున్నాయి. ఇందుకోసం పలు అంశాలను ప్రామాణికంగా తీసుకున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల వారికీ సులభంగా అందుబాటులో ఉండడం అనేది ఇందులో ప్రధానాంశం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మరోచోటుకి మార్చాలన్న ప్రతిపాదన నేపథ్యంలో… నూతన రాజధానుల్ని నిర్మించుకున్న దేశాలు ఏయే అంశాల్ని ప్రామాణికంగా తీసుకున్నాయి? ఎలాంటి హంగుల్ని సమకూర్చుకున్నాయి? అనేది చూద్దాం..
****కొత్త రాజధాని ప్రాంతాల ఎంపికకు వివిధ దేశాలు ప్రామాణికంగా తీసుకున్న అంశాలు..
1. దేశంలోని ప్రజలందరికీ అందుబాటులో.. ముఖ్యంగా దేశం మధ్యలో ఉండటం
2. తగిన మౌలిక, కమ్యూనికేషన్ సదుపాయాలు
3. భౌగోళిక అనుకూలత
4. భవిష్యత్తు విస్తరణకు వీలుగా విస్తారంగా భూముల లభ్యత
5. ఆర్థికంగా అభివృద్ధి చెందే సామర్థ్యం
6. సమగ్ర, సంతులిత అభివృద్ధికి దోహదపడటం
7. అందుబాటులో సమర్థ ప్రజా రవాణా, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు
8. నీరు లాంటి సహజ వనరుల అందుబాటు
9. వేర్వేరు ప్రాంతాల వారి ఆమోదం
******పూర్తిగా కొత్త రాజధానుల్ని నిర్మించుకున్న దేశాలు
* ఆస్ట్రేలియా:
కాన్బెర్రా(1927)
* బ్రెజిల్:
బ్రెసిలియా (1960)
* పాకిస్థాన్: ఇస్లామాబాద్(1967)
* కజికస్థాన్: ఆస్థానా (1997)
* మయన్మార్: నేపిడా (2006)
****కొత్త రాజధానుల ఏర్పాటుకు కారణాలు..
* నాటి సామ్రాజ్యవాద దేశాల నుంచి స్వాతంత్య్రం సంపాదించుకోవడం
* స్వతంత్రంగా మారిన కొన్ని ప్రాంతాలు ఒక సమాఖ్య దేశంగా ఏర్పడడం
* పాత రాజధానులు ఇరుకైపోవడం
ఎంపికకు ముఖ్య కారణాలు
అందరికీ అందుబాటు
* దేశానికి దాదాపు మధ్యలో ఉండడం, రక్షణాత్మక ప్రాంతం
* ఆధునికతకు, అభివృద్ధికి నమూనాగా చూపాలనే లక్ష్యం
***కాన్బెర్రా:
సిడ్నీ, మెల్బోర్న్ నగరాల మధ్యలో..
అందరికీ అందుబాటు
బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన ఆస్ట్రేలియా ఖండంలోని 6 ప్రాంతాలు కలిసి 1901లో సమాఖ్యగా ఏర్పడ్డాయి. వీటిలో న్యూసౌత్వేల్స్ రాజధాని సిడ్నీ, విక్టోరియా రాజధాని మెల్బోర్న్ అప్పటికే పెద్ద నగరాలు. వీటిని కాదని సంతులిత అభివృద్ధికి దోహదపడేలా కొత్త రాజధానిని నిర్మించుకోవాలని, ఇది ఏ రాష్ట్రంలోనూ భాగం కాకుండా స్వతంత్రంగా ఉండాలని సమాఖ్య నేతలు నిర్ణయించారు. ఆస్ట్రేలియాలో ఎక్కువ జనాభా ఓ కొసన తీరప్రాంతం వైపు ఉంటుంది. ఆ జనసమ్మర్ద ప్రాంతం మధ్యలో వివిధ చోట్ల పరిశీలన అనంతరం 1908లో సిడ్నీ, మెల్బోర్న్లకు మధ్యలో 900 చదరపు మైళ్ల విస్తీర్ణాన్ని రాజధాని నిర్మాణానికి అనువైనదిగా గుర్తించారు. న్యూసౌత్వేల్స్లో ఉన్న ఈ స్థలంపై ఏ రాష్ట్రానికీ పెత్తనం లేకుండా సమాఖ్య జిల్లాగా గుర్తించారు. 1913లో నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణంపై ప్రపంచ యుద్ధాలు, ఇతర అంశాలు ప్రభావం చూపినా.. 1927లో తాత్కాలిక పార్లమెంటు భవనం సహా రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ పార్లమెంటు భవనాన్ని 1988 వరకూ వినియోగించారు. దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అన్ని అనుకూలతలున్న నూతన నగర నిర్మాణం ఎంత అవసరమో కాన్బెర్రా ఉదాహరణగా నిలుస్తుంది.
**కాన్బెర్రా ఎంపికకు ముఖ్య కారణాలు
* సముద్ర తీరానికి దూరంగా ఉండడం(నాటి పరిస్థితుల దృష్ట్యా.. యుద్ధ నౌకల దాడుల భయం ఉండదని భావించారు).
* తాగునీటి సమస్య లేకపోవడం
* వాతావరణ అనుకూలత
* రెండు ప్రధాన నగరాలు సిడ్నీ, మెల్బోర్న్ మధ్యలో ఉండడం
****భౌగోళికంగా అనుకూలం : బ్రెసిలియా
బ్రెజిల్ నూతన రాజధాని బ్రెసిలియా. 1960 ఏప్రిల్లో దీన్ని ప్రారంభించారు. దేశంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో భౌగోళిక స్థానానికి ప్రాధాన్యం ఇచ్చి నిర్మించుకున్న అందాల రాజధాని. దేశ శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు మూడూ ఈ నగరంలోనే కొలువుదీరాయి. 1763 నుంచి 1960 వరకు రియో డి జనీరో, అంతకుముందు సాల్వడార్ బ్రెజిల్కు రాజధానులుగా ఉండేవి. అట్లాంటిక్ తీరంలో ఉన్న ఆ రియో నగరం దేశ ప్రజలందరికీ సమస్థాయిలో అందుబాటులో లేకపోవడం, ఇరుకైపోవడం, ట్రాఫిక్ రద్దీ పెరగడం, శత్రు దాడులకు అనుకూలంగా ఉండడం తదితర కారణలతో 1960లో రాజధానిని బ్రెసిలియాకు మార్చారు. ఈ రెండు నగరాల మధ్య దూరం 1100 కిమీ. 1956లో నిర్మాణం ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తిచేశారు. ఆధునిక నగర నిర్మాణ ప్రణాళికకు దీన్నో గొప్ప ఉదాహరణగా చెబుతారు. సరికొత్త ప్రణాళికలతో నూతన రాజధానుల దిశగా ఆలోచన చేసేలా బ్రెసిలియాను నిర్మించారు.
***ఆస్థాన(నూర్ సుల్తాన్): అందరికీ సమదూరం
ఎంపికకు కారణాలఅందరికీ అందుబాటు
* దేశానికి మధ్యలో ఉండడం
* ప్రాంతాల మధ్య అభివృద్ధిలో సమతూకాన్ని పాటించడం.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత 1991లో కజకస్థాన్ స్వతంత్య్ర దేశంగా ఆవిర్భవించింది. అప్పటికే ఆ ప్రాంతానికి అల్మాటి రాజధానిగా ఉండేది. ఆ నగరం విస్తరించడానికి అవకాశం లేకపోవడం, చైనా సరిహద్దు బాగా దగ్గరగా ఉండడం, భూకంప ముప్పు, దేశ ఆగ్నేయ దిశలో మూలన ఉండడం.. ఇలాంటి పలు కారణాల నేపథ్యంలో కొత్త రాజధాని వైపు మొగ్గు చూపారు. 1997 డిసెంబరులో రాజధానిని అల్మాటి నుంచి ఉత్తరంగా 1200 కిమీ దూరంలోని ఆస్థానకు మార్చారు. అందరికీ అందుబాటు, మౌలిక సదుపాయాల పరంగా ఇది కీలక ప్రాంతం. 2019లో ఈ రాజధాని పేరును దేశ మాజీ అధ్యక్షుడు నూర్ సుల్తాన్గా నామకరణం చేశారు.
****నేపిడా:
వ్యూహాత్మక ప్రాంతం ఎంపికకు కారణాలు
అందరికీ అందుబాటు
* దేశానికి మధ్యలో ఉంది.
* వ్యూహాత్మక ప్రాంతం.
***భారత్లోని ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్న మయన్మార్(బర్మా) నూతన రాజధాని నేపిడా. 1948 నుంచి 2005 వరకూ యాంగూన్ (రంగూన్) ఆ దేశ రాజధాని. యాంగూన్ నుంచి ఉత్తరంగా 320 కిమీ దూరంలోని నేపిడాకు 2005లో రాజధానిని మార్చారు.
****ఇస్లామాబాద్:
ప్రణాళికాబద్ధ నగరంఎంపికకు కారణాలు
అందరికీ అందుబాటు
* రక్షణ పరంగా మెరుగైనదిగా భావించడం.
* అన్ని అనుకూలతలూ ఉండడం.
భారతదేశం నుంచి 1947లో పాకిస్థాన్ విడిపోయిన తర్వాత రాజధానిగా కరాచీ కొనసాగింది. అయితే ఈ నగరం దేశానికి ఓ చివర్న సముద్ర తీరంలో ఉండడం, జనసమర్దంగా నిండిపోవడంతో.. వ్యూహాత్మకంగా జమ్మూకశ్మీర్(భారత్)కు కాస్త దగ్గర్లో.. రాజధాని ఇస్లామాబాద్ను 1960లో నిర్మించారు. ఇది అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరం.
***అబుజా:
అందుబాటులో స్థలాలుఎంపికకు కారణాలు
అందరికీ అందుబాటు
* దేశం మధ్యలో ఉంది.
* అందుబాటులో స్థలాలున్నాయి.
* తక్కువ జనసాంద్రత.
నైజీరియాకు మొదట్లో లాగోస్ రాజధానిగా ఉండేది. ఇది జన సమ్మర్దంగా కిక్కిరిసిపోయిన కారణంగా 1991 నుంచి అబుజా రాజధానిగా పాలన సాగిస్తున్నారు. 1980లలో ప్రణాళికబద్ధంగా నిర్మించిన నగరం ఇది. భౌగోళికంగా అన్ని అనుకూలతలున్న నగరం.