Business

భారతీయులు చమురు ధరలపై చింతపడవద్దు

Indians Dont Need To Worry About Oil Price Hikes

చమురు ధరల పెరుగుదల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరమేమి లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ అన్నారు. అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుంది. చమురు ధరల పెరుగుదలపై భయపడాల్సిన పనేమి లేదు’ అని ఆయన అన్నారు. ‘అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరల పెరుగుదల ఎక్కువగా లేదు. గత రెండు రోజులుగా అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి’ అని ఆయన తెలిపారు.