Politics

పవన్ పర్యటన ఆద్యంతం గుట్టుగానే…

Pawan's Delhi Trip Is All Secret-Telugu Political News

జనసేన అధినేత పవన్ కల్యాణ్​ దిల్లీ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితరులతో ఆయన సమావేశం అవుతారని వార్తలొచ్చాయి.

అయితే పవన్ ఆదివారం తాను బస చేసిన హోటల్​కే పరిమితమయ్యారని సమాచారం.

అమిత్​ షా మధ్యప్రదేశ్​ పర్యటనతో పాటు దిల్లీ ఎన్నికల హడావుడిలో ఉన్నారు.

మరోవైపు భాజపా అగ్రనేతలు దిల్లీ అభ్యర్థుల ఎంపికపై కోర్​ కమిటీ సమావేశంలో బిజీగా ఉన్నారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) రాంమాధవ్​ నేడు దిల్లీకి చేరుకోనున్నారు.

పార్టీ సంస్థాగత ఎన్నికలపై మరో ప్రధాన కార్యదర్శి సంతోష్ తీరికలేకుండా ఉన్నారు.

ఆర్​ఎస్​ఎస్​ నేతలను కలిసేందుకు పవన్​ ప్రయత్నించినట్లు తెలిసింది.