NRI-NRT

పెనమలూరు ప్రవాసుల వితరణ

పెనమలూరు ప్రవాసుల వితరణ-Penamaluru NRIs Donate To Religious Activities In Home Town

పెనమలూరు గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే అయ్యప్పస్వామి అన్న సమారాధన కార్యక్రమానికి పెనమలూరు ఎన్నారైలు(అమెరికా) వితరణ అందజేశారు. అన్నదానానికి అవసరమైన సరుకుల ఖర్చుల నిమిత్తం ₹లక్షా4వేలు అమెరికాలో సేకరించి స్వగ్రామానికి పంపారు. ఈ మొత్తాన్ని ఎన్నారై స్థానిక ప్రతినిధులు గురువారం నాడు కార్యక్రమ నిర్వాహకులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై స్థానిక ప్రతినిధులు పాలడుగు సుధీర్, కిలారు ప్రవీణ్, మోర్ల నరేంద్ర, మహేష్ కోడూరు, అయ్యప్పస్వామి అన్నసమారాధన కమిటీ సభ్యులు ముప్పాళ్ల పూర్ణ చంద్రరావు(చిన్ని), కోయ రామకృష్ణ,కోయ మధుసూదనరావు పాల్గొన్నారు.