Politics

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శైలజానాథ్

Salke Sailajanath Appointed As APCC President

ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్‌ నేత సాకే శైలజానాథ్‌ నియమితులయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. దీంతో పాటు గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శైలజానాథ్‌ను అధ్యక్షుడిగా నియమిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా సీనియర్‌ నేతలు తులసిరెడ్డి, మస్తాన్ వలీకి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.