NRI-NRT

తానా ఫౌండేషన్ ఇండియా ట్రస్టీగా శ్రీనాధ్ కుర్రా

Hyderabadi Businessman Srinath Kurra Appointed As TANA Foundation India Trustee

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ ఇండియా ట్రస్టీగా హైదరాబాద్‌కు చెందిన అలేఖ్య హోమ్స్ అధినేత కుర్రా శ్రీనాథ్ ఎంపిక అయ్యారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు శ్రీనాధ్ ట్రస్టీ హోదాలో సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఇటీవల అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో నిర్వహించిన “అమ్మ-నాన్న-గురువు” శతక పద్య పదార్చన కార్యక్రమంలో కీలక భూమిక పోషించిన శ్రీనాధ్ అభ్యర్థిత్వాన్ని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ప్రతిపాదించగా ఫౌండేషన్ ఛైర్మన్ నిరంజన్ శృంగవరపు నేతృత్వంలోని ట్రస్టీ కార్యవర్గ బృందం ఏకగ్రీవంగా ఆమోదించింది. శ్రీనాధ్‌కు తానా కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు.