శ్వేతసౌధం తాజ్మహల్ చేరగానే.. కెమెరాలు క్లిక్మంటాయి. సెల్ఫీలు జోరందుకుంటాయి. అంతవరకూ బాగానే ఉన్నా.. డ్రోన్ కెమెరాలు గాల్లో లేస్తే మాత్రం కుదరదు. తాజ్మహల్ కాంప్లెక్స్లో డ్రోన్లు వాడరాదంటూ ఆగ్రా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం కోర్టు తీర్పునకు లోబడి ఈ చర్యలు తీసుకున్నారు. తాజ్ పరిసరాల్లో డ్రోన్లపై నిషేధం అని గోడపత్రికలు అతికించారు. ప్రీవెడ్డింగ్, ఇతర చిత్రాల షూటింగ్స్ కారణంగా ఇటీవల డ్రోన్ల వాడకం పెరిగింది. పర్యాటకుల భద్రత రీత్యా.. డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు విధించామని చెబుతున్నారు పోలీసులు.
తాజ్ వద్ద డ్రోన్లు నిషేధం
Related tags :