Politics

ఢిల్లీలో I Love Amaravati బోర్డు మాయం

AP Bhavan's I Love Amaravathi Board Goes Missing

దేశ రాజధానిలోని ఏపీ భవన్‌ నంది విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన ‘ఐ లవ్‌ అమరావతి’ బోర్డును సిబ్బంది తొలగించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం అమరావతి పేరుతో ఏపీ భవన్‌ వద్ద బోర్డు ఏర్పాటు చేసింది. గతేడాది సంక్రాంతి సందర్భంగా ‘ఐ లవ్‌ అమరావతి’ సంక్రాంతి సంబరాలు సెల్ఫీ బోర్డులను రూ.లక్షలు వెచ్చించి ఏపీ భవన్‌ అధికారులు ఏర్పాటు చేశారు. అప్పటి రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ వీటిని ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత సంక్రాంతి సంబరాల సెల్ఫీ బోర్డు తీసేసి.. ఐ లవ్‌ అమరావతి బోర్డును అధికారులు కొనసాగించారు. తాజాగా మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈరోజు అమరావతి బోర్డును తొలగించారు. ఏపీ భవన్‌ ప్రస్తుత రెసిడెంట్‌ కమిషనర్‌ భావన సక్సేనా ఆదేశాలకు అనుగుణంగా బోర్డును తొలగించినట్లు సిబ్బంది తెలిపారు. ఏపీ భవన్‌లో నిత్యం భోజనానికి వచ్చేవారు ఈ బోర్డు వద్ద సెల్ఫీ దిగేవారు.