బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న జరగనుంది.
ఈ వివాహ వేడుకకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీని రమేశ్ కుటుంబం ఆహ్వానించింది.
ఇవాళ మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని కార్యాలయానికి వెళ్లిన రమేశ్.. మోదీని కలిసి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఆహ్వానించారు.
ఇదిలా ఉంటే.. త్వరలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, టాలీవుడ్కు చెందిన ప్రముఖులను సీఎం రమేశ్ ఆహ్వానిస్తారని తెలుస్తోంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో రిత్విక్ నిశ్చితార్థం కొద్దిరోజుల కిందటే దుబాయ్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
నిశ్చితార్థానికి పలువురు ఎంపీలతో పాటు టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు.