Politics

కాంగ్రెస్ వద్ద కాసులు లేవు…అభిమానం మాత్రమే ఉంది

Jaggareddy Reviews 2020 Elections In Telangana

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో డబ్బు ప్రభావం స్పష్టంగా కనిపించిందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్బులతో ఎన్నికలను గెలవచ్చనే కొత్త తరహా విధానాన్ని తెరాస తీసుకొచ్చిందని జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వద్ద డబ్బు లేదని.. ప్రజల ఆదరాభిమానాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. సంగారెడ్డిలో రెండు మున్సిపాలిటీలు గెలిచిన ఆర్థిక మంత్రి హరీష్‌రావును అభినందిస్తున్నట్లు చెప్పారు. తన భార్య మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కాకపోవడమే మంచిదైందని.. ఓటర్లు తనమీద ఎలాంటి ఒత్తిడి లేకుండా చేశారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు ఉమ్మడి మెదక్‌ జిల్లాకు సింగూరు నీళ్లు తీసుకొచ్చే బాధ్యతను ప్రజలు మంత్రి హరీష్‌రావుకు అప్పగించారని అన్నారు.