ఖమ్మం మిర్చి యార్డులో ఉద్రిక్తత నెలకొంది. మిరప ధర పతనాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ఒకేసారి మిర్చిధరను రూ. 5 వేలు తగ్గించి క్వింటాల్కు రూ.13,000 కేటాయించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా జెండా పాట రూ.17000లుగా పెట్టి.. ఇవాళ ఒకేసారి తగ్గించటంతో ఆందోళనకు దిగారు. పంటను అమ్మేది లేదంటూ మార్కెట్ గేట్లు మూసి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సర్ది చెప్పేందుకు వచ్చిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకటరమణను రైతులు చుట్టుముట్టారు.
ఖమ్మం మిర్చి యార్డులో 5వేలు తగ్గిన మిర్చి ధర
Related tags :