WorldWonders

కృష్ణా గుంటూరు జిల్లాల ఘనత ఇదే

The history and wonders of krishna guntur districts

కృష్ణా గుంటూరు జిల్లాల మాట వినగానే ఏం చెప్పక ముందే అబ్బో… అనే సౌండ్ వస్తుంది కదా !

అలా ఎందుకొస్తుందో తెలియాలంటే మీరు కచ్చితంగా ఇది చదవాల్సిందే !

ఉన్నసంగతేంటో కొన్ని బుల్లెట్ పాయింట్స్ లా ఉంది. చకచకా చదివేయండి.

– దేశంమొత్తంమ్మీద కృష్ణా జిల్లానే టాప్. ఇండియా జీడీపీ 7.5 శాతం. ఏపీ జీడీపీ 11.99 శాతం. కృష్ణాజిల్లా జీడీపీ 12.89 శాతం. తలసరి ఆదాయంలో కృష్ణాది రాష్ట్రంలో సెకండ్ స్పాట్. 1,40,593 రూపాయలు. గుంటూరుదైతే 1.04 లక్షలు.

– దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్యంలో కృష్ణా గుంటూరు జిల్లాల వాటా7.6 శాతం. దేశంలోనే ఈ రెండు జిల్లాలదే టాప్ పొజిషన్.

– కృష్ణా గుంటూరు జిల్లాల్లో 2960 మంది బిలీనియర్లు ఉన్నారు. ఈ జిల్లాల నుంచి వెళ్లిన వాళ్లలో 460 మంది అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో టైకూన్ లుగా ఉన్నవాళ్లే !

– పొగాకు, పసుపు, మిర్చిలో ఆసియా దేశాలకి ఎగుమతి చేసే మోస్ట్ వాంటెడ్ సెంటర్ గుంటూరే. ఇక్కడి నుంచి వచ్చే ఉత్పత్తుల్ని మయన్మార్, సింగపూర్, మలేషియా, ధాయ్ లాండ్ ప్రత్యేకంగా తీసుకొంటాయ్.

– వాహనాల వాడకంలోనూ కృష్ణా, గుంటూరులే టాప్. టూవీలర్, ఫోర్ వీలర్ అన్నీ కలిపి ఈ రెండు జిల్లాల్లో 196 షోరూమ్ లు ఉన్నాయ్. ఇందులో 44 కార్ల కంపెనీ షోరూమ్ లే ! రూరల్ జిల్లాల్లో ఇంత మార్కెట్ ఉన్న ఒకేఒక్క ఏరియా ఇదే.

దేశంలోనే ఇది రికార్డ్.

25 లక్షల వాహనాలున్నాయ్ కాబట్టి ఏపీలో ఎక్కువగా ఫ్యూయెల్ వాడుతున్నది కూడా ఈ రెండు జిల్లాలే !

– కేరళ తర్వాత దేశంలో ఎక్కువమంది ఎన్నారైలు ఉన్న ప్రాంతం కృష్ణా, గుంటూరు జిల్లాలే !

29500 మంది ప్రవాసులున్నారు రెండు జిల్లాల్లో ! జిల్లాల వారీగా తీస్తే… ఇది దేశంలోనే టాప్ !

– దేశం మొత్తంమ్మీదా వైద్యులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కృష్ణా గుంటూరు. ఈ రెండు జిల్లాల్లో 12600 డాక్టర్లున్నారు. ఇంతమంది మరెక్కడా లేరు. అమెరికాలో ఉన్న తెలుగు డాక్టర్లలో కూడా వీళ్లే ఎక్కువ.

– ఇంటర్నెట్ వినియోగంలో ఏపీలో కృష్ణా గుంటూరు జిల్లాలే టాప్. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో 36 శాతం ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నారు.

– గుంటూరు జిల్లాలో 29 గ్రామాల రైతులు… 33 వేల ఎకరాలు స్వచ్చందంగా రాజధానికి కోసం ఇచ్చారు. అందులో 8 వేల ఎకరాలు రైతు కుటుంబాలకి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయిస్తోంది. తిరిగి ఇస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద భూ సమీకరణ.

– కృష్ణా గుంటూరు జిల్లాల్లో 28 జలవిద్యుత్కేంద్రాలున్నాయ్. ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రం కావడంలో వీటి పాత్ర చాలా కీలకం . కృష్ణా గుంటూరు జిల్లాల్లో సరిగ్గా 28 సిమెంట్ కంపెనీలు కూడా ఉన్నాయ్. నిర్మాణానికి ఇవే మూలస్తంభాలు.

– 1954 నుంచి 140 మంది తెలుగువాళ్లకి పద్మశ్రీలు వస్తే…అందులో 45 మంది కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్లే ! 18 పద్మవిభూషణ్ లు వస్తే అందులో ఐదుగురు కృష్ణా జిల్లాల వాళ్లే !

– కృష్ణా గుంటూరు జిల్లాలు చదవుల్లోనూ టాపే ! గుంటూరులో 51 ఇంజినీరింగ్ కాలేజీలుంటే… కృష్ణాలో 39 ఉన్నాయ్. 690 ఇంటర్మీడియట్ కాలేజీలు, ఐదు వర్సీటీలూ ఈ జిల్లాల్లో ఉన్నాయ్.

– ఇక కృష్ణా గుంటూరు జిల్లాల నదీతీరాల్లో 438 గుళ్లూగోపురాలున్నాయ్. తమిళనాడులో కూడా ఇంత డెన్సిటీతో ఆలయాలు లేవ్.కృష్ణా