‘నిర్భయ’ దోషులకు మార్చి 3న ఉరి తీసేందుకు పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడం పట్ల నిర్భయ తల్లి హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే ఉరిశిక్ష అమలు చాలా ఆలస్యమైందనీ.. అయినా తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు సంతోషం కలిగించిందని చెప్పారు. న్యాయం కోసం తామెంతగానో పోరాటం చేశామని గుర్తు చేసుకున్నారు. తన కుమార్తెను కిరాతకంగా బలితీసుకున్న ఆ మృగాళ్లకు చివరకు డెత్ వారెంట్ జారీ చేయడం హర్షణీయమన్నారు. మార్చి 3న దోషులకు కచ్చితంగా ఉరిశిక్ష అమలుచేస్తారని ఆశిస్తున్నామని అన్నారు.
మార్చి 3న మృత్యు ముహూర్తం
Related tags :