Politics

చంద్రబాబు జనచైతన్య యాత్ర

Chandrababu To Begin JanaChaitanya Yatra 2020

రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్యయాత్రను చేపడుతున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. వైకాపా అరాచక, అసమర్థ, అవినీతి పాలనపై రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వైకాపా ప్రభుత్వ పాలనా విధానాలు, ప్రజలను మోసగిస్తున్న తీరుపై ప్రజల్లో చైతన్యం తెస్తామని ఆయన అన్నారు. తెదేపా నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు ఈ ప్రజా చైతన్యయాత్రలో పాలుపంచుకుని వైకాపా ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ బాధితులకు అండగా ఉన్నామనే భరోసా కల్పించాలని పార్టీ శ్రేణులను కోరారు. ప్రజా చైతన్యయాత్రను విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.