Sports

మహిళలు మెరిశారు

Indian Women's Team Wins T20 Game

పూనమ్‌ యాదవ్‌ (4/19) విజృంభించడంతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఘనంగా బోణీకొట్టింది. శుక్రవారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. దీప్తి శర్మ (49*, 46 బంతుల్లో; 3×4) రాణించింది. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్‌ 19.5 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ బ్యాటర్లలో అలిసా హీలీ (51, 35 బంతుల్లో; 6×4, 1×6), ఆష్లీ గాడ్నర్ (34, 36 బంతుల్లో; 3×4, 1×6) పోరాడారు.