Sports

భారత అమ్మాయిలు బంగ్లాని ఓడించారు

Indian Women T20 Team Crushes Bangladeshi Team

భారత బౌలర్లు మరోసారి సత్తా చాటడంతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన మరో విజయం సాధించింది. సోమవారం పెర్త్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 18 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ (39, 17 బంతుల్లో; 2×4, 4×6), జెమిమా రోడ్రిగ్స్‌ (34, 37 బంతుల్లో; 2×4, 1×6) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన బంగ్లా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేసింది. బంగ్లా బ్యాటర్లలో ముర్షిదా (30, 26 బంతుల్లో; 4×4), నిగర్‌ సుల్తానా (35, 26 బంతుల్లో; 5×4) పోరాడారు. ఈ విజయంతో ప్రపంచకప్‌ గ్రూప్‌-ఎ పట్టికలో టీమ్‌ఇండియా నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.