ScienceAndTech

Flash:మోడీ సంచలన నిర్ణయం

Narendra Modi Takes Sensational Decision On Social Media

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకున్న అన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఆదివారం ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్ ఛానెళ్లనుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఫేస్‌బుక్ ద్వారా ఆయన్ను 4 కోట్ల 47 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా 3 కోట్ల 52 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ట్విటర్‌లో 5 కోట్ల 33 లక్షల మంది అనుసరిస్తున్నారు. మిగతా అకౌంట్లను కలుపుకుంటే మోడీని సోషల్ మీడియా ద్వారా 15 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. సామాజిక మాధ్యమాల నుంచి మోడీ ఎందుకు వైదొలుగుతున్నారో తెలియరాలేదు.